Share News

ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:16 AM

చిత్తూరులోని శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (సీటమ్స్‌)లో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి.

ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు
విద్యార్థుల అడ్మిట్‌ కార్డును పరిశీలిస్తున్న సిబ్బంది

చిత్తూరు (సెంట్రల్‌), జనవరి 27: చిత్తూరులోని శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (సీటమ్స్‌)లో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం జరిగిన పరీక్షకు 128 మంది విద్యార్థులకుగాను 124మంది హాజరవగా, నలుగురు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 128 మందికిగాను 122 మంది హాజరవగా, ఆరుగురు గైర్హాజరైనట్లు జేఈఈ మెయిన్స్‌ సిటీ కోఆర్డినేటర్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు.

Updated Date - Jan 28 , 2024 | 12:16 AM