Share News

అక్రమంగా నిల్వచేసిన ఇసుక సీజ్‌

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:58 AM

చిత్తూరు నగర శివార్లలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను మంగళవారం సీజ్‌ చేసినట్లు ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ సుబ్బరాజు తెలిపారు.

అక్రమంగా నిల్వచేసిన ఇసుక సీజ్‌
అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక

చిత్తూరు, మార్చి 26: చిత్తూరు నగర శివార్లలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను మంగళవారం సీజ్‌ చేసినట్లు ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ సుబ్బరాజు తెలిపారు. చిత్తూరు- పుత్తూరు మార్గంలో నిర్మాణంలోని ఓ కళాశాల భవనం వద్ద ఇసుక అక్రమ నిల్వలు ఉన్నాయని సమాచారం వచ్చిందన్నారు. అక్కడకు వెళ్లి చూడగా పెద్ద ఎత్తున ఇసుక నిల్వచేసి ఉన్నారన్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో ఇసుకకు సంబంధించిన వివరాలు అడగ్గా, ఎటువంటి బిల్లులు, అనుమతి పత్రాలు లేవని చెప్పారన్నారు. దీంతో అక్కడున్న 700 టన్నుల ఇసుకను రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్‌ చేశామని ఆయన తెలిపారు.

Updated Date - Mar 27 , 2024 | 12:58 AM