Share News

నీటి ఎద్దడి ఏర్పడే గ్రామాలను గుర్తించండి

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:44 AM

ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడే గ్రామాలను గుర్తించి సోమవారం లోగా నివేదికలు ఇవ్వాలని కలెక్టర్‌ షన్మోహన్‌ ఆదేశించారు.

నీటి ఎద్దడి ఏర్పడే గ్రామాలను గుర్తించండి

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 28: ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడే గ్రామాలను గుర్తించి సోమవారం లోగా నివేదికలు ఇవ్వాలని కలెక్టర్‌ షన్మోహన్‌ ఆదేశించారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయం నుంచి ఆయన మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల విధులతో పాటు నీటి ఎద్దడి ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నీటి ఎద్దడి ఉండే గ్రామాల్లో హేబిటేషన్ల వారీగా అక్కడ ఉన్న నీటి వనరులను పరిశీలించి, ఆ నీటిని సరఫరా చేసే ప్రక్రియను గుర్తించాలన్నారు. పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లోని కొన్నిచోట్ల నీటి సరఫరాలో ఇబ్బందులున్నాయని, వాటిని అధిగమించడానికి చర్యలు చేపట్టాలన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి రవాణాకు అనుమతి లేదని, పొరుగున ఉన్న బోర్ల నుంచి తాత్కాలిక పద్ధతిలో సమీప గ్రామాలకు తాగునీటి సరఫరా చేయాలన్నారు. ఇటీవల అంగన్‌వాడీ కేంద్రాల్లో వేసిన బోర్లను ఉపయోగించుకోవాలన్నారు. 250కి పైగా బోర్లున్న చోట్ల వాటి మరమ్మతులకోసం మరో మెకానిక్‌ను నియమించుకోవాలన్నారు. విడిభాగాల కొనుగోళ్లకు నివేదిక ఇవ్వాలని చెప్పారు.

Updated Date - Mar 29 , 2024 | 12:44 AM