ముద్దనపల్లె, బిరుగుండ్లపల్లెలో ఏనుగుల హల్చల్
ABN , Publish Date - Apr 24 , 2024 | 01:53 AM
మండలంలోని అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు ఏనుగుల దాడులతో గజగజలాడుతున్నారు. ఆదివారం రాత్రి నాలుగు ఏనుగులు ఎస్.గొల్లపల్లె గ్రామ సమీప పొలాల్లో స్వైరవిహారం చేశాయి.
రామకుప్పం, ఏప్రిల్ 23: మండలంలోని అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు ఏనుగుల దాడులతో గజగజలాడుతున్నారు. ఆదివారం రాత్రి నాలుగు ఏనుగులు ఎస్.గొల్లపల్లె గ్రామ సమీప పొలాల్లో స్వైరవిహారం చేశాయి. తాజాగా మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ముద్దనపల్లె-బిరుగుండ్లపల్లె గ్రామాల మధ్య పొలాల్లో మూడు ఏనుగులు తిష్ట వేసి, పంటలను ధ్వంసం చేశాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులతోపాటు గ్రామస్తులు టపాకాయలు పేల్చుతూ వాటిని అడవిలోకి తరిమే ప్రయత్నం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.