Share News

ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలపై దృష్టిపెడతా

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:59 AM

అధికారుల, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజలకందేలా కృషి చేస్తానని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ చెప్పారు. తిరుపతి కలెక్టర్‌గా గురువారం ఉదయం కలెక్టరేట్‌ ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలపై దృష్టిపెడతా
కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

తిరుపతి/తిరుమల, జూలై 4 (ఆంధ్రజ్యోతి): అధికారుల, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజలకందేలా కృషి చేస్తానని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ చెప్పారు. తిరుపతి కలెక్టర్‌గా గురువారం ఉదయం కలెక్టరేట్‌ ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు.పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.డెంగ్యూ జ్వరాల నివారణ చర్యలపై దృష్టి పెడతామన్నారు. అంతకుముందు ఆయన తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.కలెక్టర్‌గా శ్రీవారి సన్నిధిలో బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:59 AM