ఎస్పీ రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:49 AM
జీడీనెల్లూరు మండలం సుందరరాజుపురం వద్దగల ఎస్పీ రబ్బరు ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది.
గంగాధరనెల్లూరు, మార్చి 27: జీడీనెల్లూరు మండలం సుందరరాజుపురం వద్దగల ఎస్పీ రబ్బరు ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీ ఆవరణలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో షార్ట్సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు పక్కనున్న గడ్డిపై పడి మంటలు వ్యాప్తిచెందాయి. ఫ్యాక్టరీ లోపల టైర్ల రబ్బర్పొడి బస్తాలతో పాటు యంత్రాలకూ మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో యజమాని, సిబ్బంది భోజనానికి వెళ్లారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. అప్పటికే చాలావరకు రబ్బరు పొడి కాలిపోగా.. యంత్రాలూ దెబ్బతిన్నాయి. దీనిపై యాజమాన్యం ఫిర్యాదు చేయలేదని, ఎంత నష్టం వాటిల్లిందనే వివరాలూ చెప్పలేదని అధికారులు పేర్కొన్నారు.