Share News

విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:49 AM

గుడిపాల మండలం 197 రామాపురం పంచాయతీ సింగారపేటలో గురువారం విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతిచెందారు.

విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి
మృతిచెందిన షాలిని

గుడిపాల, మార్చి 28: గుడిపాల మండలం 197 రామాపురం పంచాయతీ సింగారపేటలో గురువారం విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతిచెందారు. సింగారపేటకు చెందిన లారెన్స్‌ భార్య షాలిని(46) తమ పొలంలో మోటారు స్విచ్‌ ఆన్‌చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయుపపడ్డారు. చికిత్స నిమిత్తం ఆమెను వేలూరు సీఎంసీకి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:49 AM