విద్యుత్ ఈఈ తొలగింపు
ABN , Publish Date - Mar 24 , 2024 | 02:08 AM
ఎస్పీడీసీఎల్ మదనపల్లె ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యుగంధర్ను శనివారం విధుల నుంచి తొలగించారు. 2014లో ఆయన విజయవాడ సర్కిల్లో విఽధులు నిర్వహిస్తుండగా ఏసీబీ దాడులు నిర్వహించింది.
![విద్యుత్ ఈఈ తొలగింపు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
తిరుపతి సెంట్రల్, మార్చి 23: ఎస్పీడీసీఎల్ మదనపల్లె ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యుగంధర్ను శనివారం విధుల నుంచి తొలగించారు. 2014లో ఆయన విజయవాడ సర్కిల్లో విఽధులు నిర్వహిస్తుండగా ఏసీబీ దాడులు నిర్వహించింది. అక్రమార్జనకు పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేసింది. ఆ కేసులో ఇటీవల తుదితీర్పు వెలువరించారు.దీంతో ఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 33 ఏళ్ల క్రితం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సబ్ ఇంజనీర్గా బాధ్యతలు స్వీకరించిన యుగంధర్ గతేడాది పదోన్నతిపై ఈఈగా మదనపల్లె డివిజన్కు బదిలీ అయ్యారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ విచారణ అనంతరం విధుల నుంచి తొలగించారు.