డీఐఈవో బాధ్యతల స్వీకారం
ABN , Publish Date - Jan 11 , 2024 | 12:55 AM
ఇంటర్ బోర్డు జిల్లా విద్యాశాఖాధికారి(డీఐఈవో)గా ఎ.స్వర్ణలత బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
![డీఐఈవో బాధ్యతల స్వీకారం](https://media.andhrajyothy.com/media/2023/20231205/10chandhra1_FF_88dd00d500.jpg)
తిరుపతి(విద్య), జనవరి 10 : ఇంటర్ బోర్డు జిల్లా విద్యాశాఖాధికారి(డీఐఈవో)గా ఎ.స్వర్ణలత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నాగలాపురం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న ఈమెను జిల్లా ఎఫ్ఏసీ అధికారిగా నియమిస్తూ ఇంటర్ బోర్డు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేసి ఇంటర్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పలువురు ఉద్యోగులు ఆమెను సన్మానించారు. కాగా ఇంతకుముందు డీఐఈవోగా పనిచేసిన విశ్వనాథనాయక్ తిరిగి చిన్నగొట్టిగల్లు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్గా బాధ్యతలు తీసుకున్నారు.