జనసేనానిని కలిసి దగ్గుమళ్ల
ABN , Publish Date - Apr 14 , 2024 | 01:10 AM
చిత్తూరు పార్లమెంటు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు శనివారం తిరుపతిలో జనసేనాని పవన్ కల్యాణ్ను కలిశారు.
![జనసేనానిని కలిసి దగ్గుమళ్ల](https://media.andhrajyothy.com/media/2024/20240413/13ctr20_FF_126f0e7be4.jpg)
చిత్తూరు సిటీ, ఏప్రిల్ 13: చిత్తూరు పార్లమెంటు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు శనివారం తిరుపతిలో జనసేనాని పవన్ కల్యాణ్ను కలిశారు. చిత్తూరు పార్లమెంటు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే దగ్గుమళ్ల ప్రసాదరావును గెలిపించుకోవాలని ప్రజలకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఆయన నిత్యం అందుబాటులో ఉండి పార్లమెంటు అభివృద్ధికి కృషిచేస్తారని చెప్పారు. చిత్తశుద్ధితో పనిచేస్తారని పేర్కొన్నారు.
టీడీపీ కూటమితోనే అభివృద్ధి
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. శనివారం చిత్తూరులో ఆయన జీడీ నెల్లూరు ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. చంద్రబాబు ఆదేశాలమేరకు అందరం కలసికట్టుగా పనిచేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. సూపర్ సిక్స్.. మ్యానిపెస్టోలోని పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. నేతలు రుద్రయ్య నాయుడు, లోకనాథ నాయుడు, కార్జాల అరుణ, ఇందరమ్మ, జయశంకర్ నాయుడు, రాజేంద్ర, చెంగల్రాయ యాదవ్, స్వామిదాసు, రాజశేకర్, రెడ్డెప్ప, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.