Share News

బోయకొండలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Apr 22 , 2024 | 02:20 AM

బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచేగాక తమిళనాడు, కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

బోయకొండలో భక్తుల రద్దీ

చౌడేపల్లె, ఏప్రిల్‌ 21 : బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచేగాక తమిళనాడు, కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలన్నీ నిండిపోయాయి. అర్చకులు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, పంచామృతాభిషేకాలు చేశారు. స్వర్ణాభరణాలతో, పూలతో అలంకరించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించి, భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ చైర్మన్‌ నాగరాజరెడ్డి, ఈవో చంద్రమౌళి పర్యవేక్షించారు.

Updated Date - Apr 22 , 2024 | 02:20 AM