ముగిసిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు
ABN , Publish Date - Feb 02 , 2024 | 12:34 AM
చిత్తూరులోని సీటమ్స్లో ఈనెల 24న మొదలైన జేఈఈ మెయిన్స్ పరీక్షలు గురువారంతో ముగిశాయి.
![ముగిసిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చిత్తూరు (సెంట్రల్), ఫిబ్రవరి 1: చిత్తూరులోని సీటమ్స్లో ఈనెల 24న మొదలైన జేఈఈ మెయిన్స్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షలకు 256 మంది విద్యార్థులకు గాను 248 మంది హాజరు కాగా, ఎనిమిది మంది గైర్హాజరైనట్లు సిటీ కోఆర్డినేటర్ సుబ్రమణ్యం తెలిపారు. ఉదయం పరీక్షకు 128 మందికి గాను 124 మంది.. మధ్యాహ్నం 128 మందికి గాను 124 మంది హాజరయ్యారన్నారు.