గెలుచుకుని రండి
ABN , Publish Date - Apr 22 , 2024 | 02:23 AM
గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫామ్ అందజేసిన చంద్రబాబు
చిత్తూరు సిటీ, ఏప్రిల్ 21: గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయన చేతుల మీదుగా వారికి బీ ఫారాలు అందించారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, చంద్రగిరి, గంగాధరనెల్లూరు, నగరి, చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు పులివర్తి నాని, థామస్, గాలి భానుప్రకాష్, గురజాల జగన్మోహన్, కలికిరి మురళీమోహన్ బీ ఫారాలు అందుకున్నారు. అనంతరం చంద్రబాబు అభ్యర్థుల చేత ప్రమాణం చేయించారు. ఉమ్మడి మ్యానిఫెస్టోను ప్రతి గడపకూ తీసుకెళ్లాలని సూచించారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ అప్రజాస్వామిక పాలనను ప్రజలకు వివరించా లన్నారు. విజయంతో తిరిగిరావాలని సూచించారు.