నేడు విజయవాడకు కలెక్టర్, ఎస్పీ పయనం
ABN , Publish Date - Jan 08 , 2024 | 12:57 AM
త్వరలో జరిగే సాధారణ ఎన్నికల సన్నాహక ఏర్పాట్లపై సమీక్షకు కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 9వ తేదీన రాష్ట్రానికి రానుంది.
![నేడు విజయవాడకు కలెక్టర్, ఎస్పీ పయనం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 7: త్వరలో జరిగే సాధారణ ఎన్నికల సన్నాహక ఏర్పాట్లపై సమీక్షకు కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 9వ తేదీన రాష్ట్రానికి రానుంది. ఈనేపథ్యంలో 9, 10 తేదీల్లో విజయవాడలోని నోవాటెల్ హోటల్లో కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో సమావేశం జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకోసం సోమవారం కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ రిషాంత్రెడ్డి బయలుదేరి వెళ్తున్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తీసుకొనే చర్యలపై వీరు కేంద్ర ఎన్నికల సంఘ అధికారులకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.