చింతా మోహన్కు ఆస్తి నిల్
ABN , Publish Date - Apr 20 , 2024 | 01:39 AM
ఆరు సార్లు పార్లమెంటు సభ్యుడు. అందులో ఓ పర్యాయం కేంద్ర మంత్రి. తాజాగా పదకొండో సారి ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు డాక్టర్ చింతా మోహన్.
తిరుపతి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ఆరు సార్లు పార్లమెంటు సభ్యుడు. అందులో ఓ పర్యాయం కేంద్ర మంత్రి. తాజాగా పదకొండో సారి ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు డాక్టర్ చింతా మోహన్. శుక్రవారం ఆయన సమర్పించిన అఫిడవిట్లో ఆస్తి విలువ సున్నా. బ్యాంకు బ్యాలెన్స్ కూడా రూ.2వేల లోపే. చేతిలో మాత్రం రూ.40వేలు ఉన్నట్టు చూపించారు. స్థిరాస్తి సెంటు భూమి కూడా లేదని వెల్లడించారు. భార్య పేరుతో మాత్రం తిరుపతి రామచంద్ర నగర్లో ఓ ఇల్లు, దాని సమీపంలో రూ1.40కోట్ల స్థలం ఉన్నట్టు చూపించారు.