Share News

నేడు తిరుమలకు చిరంజీవి

ABN , Publish Date - Mar 26 , 2024 | 02:03 AM

ప్రముఖ సినీనటుడు చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్‌ కుటుంబ సభ్యులతో మంగళవారం తిరుపతికి రానున్నారు.

నేడు తిరుమలకు చిరంజీవి

తిరుపతి అర్బన్‌, మార్చి 25: ప్రముఖ సినీనటుడు చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్‌ కుటుంబ సభ్యులతో మంగళవారం తిరుపతికి రానున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం 4గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుని రాత్రికి బసచేస్తారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం హైదరాబాదుకు తిరుగుప్రయాణమవుతారు. బుధవారం రాంచరణ్‌ జన్మదినం సందర్భంగా తిరుమల పర్యటనకు వస్తున్న వారికి స్వాగతం పలికేందుకు మెగా అభిమానులు, జనసేన సైనికులు విమానాశ్రయానికి రావాలని అఖిలభారత చిరంజీవి యువత ఉమ్మడిజిల్లా అధ్యక్షుడు పూల ప్రభాకర్‌ ఓ ప్రకటనలో కోరారు.

Updated Date - Mar 26 , 2024 | 02:03 AM