రామానాయుడుపల్లె వద్దే చంద్రబాబు సభ
ABN , Publish Date - Feb 02 , 2024 | 12:27 AM
మాజీ సీఎం చంద్రబాబు ‘రా..కదలిరా’ బహిరంస సభకు గంగాధరనెల్లూరు పంచాయతీ రామానాయుడుపల్లె వద్ద స్థలాన్ని ఎంపిక చేశారు.
![రామానాయుడుపల్లె వద్దే చంద్రబాబు సభ](https://media.andhrajyothy.com/media/2023/20231205/1ctr_gdn_2_FF_e0d07366b2.jpg)
గంగాధరనెల్లూరు, ఫిబ్రవరి 1: మాజీ సీఎం చంద్రబాబు ‘రా..కదలిరా’ బహిరంస సభకు గంగాధరనెల్లూరు పంచాయతీ రామానాయుడుపల్లె వద్ద స్థలాన్ని ఎంపిక చేశారు. రామానాయుడుపల్లె (చిత్తూరు - పుత్తూరు ప్రధాన రోడ్డుపక్కన) బస్టాప్ వద్ద ఈ స్థలంలో సభా వేదిక ఏర్పాట్లకు గురువారం భూమిపూజ చేశారు. ఈ స్థలంలో మంగళవారం చంద్రబాబు సభ జరగనుంది. ఈ సభా స్థలాన్ని మాజీ మంత్రి అమరనాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తినాని, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి థామస్, నియోజకవర్గ పరిశీలకుడు రవిప్రకా్ష పరిశీలించారు. ఈకార్యక్రమంలో నగరి, పూతలపట్టు టీడీపీ ఇన్చార్జిలు గాలి భానుప్రకాష్, మురళిమోహన్, జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రగుంట్ల క్రిష్ణమనాయుడు, జిల్లా టీడీపీ యాదవ సాధికారసమితి అధ్యక్షుడు శ్రీధర్యాదవ్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు వెంకటేష్, జిల్లా తెలుగుయువత మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి రాంబాబురెడ్డి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు కార్జాల అరుణ, గంగాధరనెల్లూరు, శ్రీరంగరాజుపురం, కార్వేటినగరం మండలాల టీడీపీ అధ్యక్షులు స్వామిదాస్, జయశంకర్నాయుడు, చెంగల్రాయయాదవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. కాగా, భూమి పూజ చేసిన వెంటనే ఎక్స్కవేటర్తో ముళ్ళకంపలు, పిచ్చిమొక్కలను తొలగించే పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు వేదిక, సభా ప్రాంగణం కోసం అవసరమైన మెటీరియల్తో లారీలు గురువారం సాయంత్రానికి చేరుకున్నాయి.