కారు దగ్ధం
ABN , Publish Date - May 17 , 2024 | 02:15 AM
ఓ కారు దగ్ధమైన సంఘటన తిరుపతి గరుడ సర్కిల్లో జరిగింది. నంద్యాల జిల్లా బనగానపల్లెకి చెందిన ఎం.శ్రీనివాస రెడ్డి కుటుంబీకులతో తిరుమలకు వెళ్లారు.
తిరుపతి(నేరవిభాగం), మే 16: ఓ కారు దగ్ధమైన సంఘటన తిరుపతి గరుడ సర్కిల్లో జరిగింది. నంద్యాల జిల్లా బనగానపల్లెకి చెందిన ఎం.శ్రీనివాస రెడ్డి కుటుంబీకులతో తిరుమలకు వెళ్లారు. శ్రీవారి దర్శనానంతరం కారులో గురువారం తిరుపతికొచ్చారు. అనంతరం మోహన్బాబు కాలేజీ వద్దకెళ్లి అక్కడ తెలిసిన వారితో మాట్లాడి జూ పార్కు రోడ్డులో తిరుపతికి బయల్దేరారు. అలిపిరి గరుడ సర్కిల్ సమీపానికి వచ్చేసరికి కారు ఇంజిన్ వేడెక్కి, ఉన్నట్టుండి బ్యాటరీలనుంచి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై వాహనంలోని వారిని దింపేయడంతో పెనుప్రమాదం తప్పింది. తాము వెళ్లేసరికే కారు చాలావరకు దగ్ధమవగా, రూ.3లక్షల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి కిరణ్కుమార్ రెడ్డి తెలిపారు.