తిరుపతి- కాట్పాడి మధ్య నాలుగు ప్యాసింజర్ రైళ్ల రద్దు
ABN , Publish Date - May 21 , 2024 | 01:57 AM
తిరుపతి-కాట్పాడి స్టేషన్ల మధ్య రోజువారీగా నడుస్తున్న స్పెషల్ ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 27 నుంచి 30వ తేది వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
![తిరుపతి- కాట్పాడి మధ్య నాలుగు ప్యాసింజర్ రైళ్ల రద్దు](https://media.andhrajyothy.com/media/2024/20240511/nn_49e15cd256.jpg)
తిరుపతి(సెంట్రల్), మే 20: తిరుపతి-కాట్పాడి స్టేషన్ల మధ్య రోజువారీగా నడుస్తున్న స్పెషల్ ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 27 నుంచి 30వ తేది వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.కోయంబత్తూరు-తిరుపతి,విల్లుపురం-తిరుపతి,బెంగళూరు-తిరుపతి మధ్య రాకపోకలు సాగిస్తున్న ఎక్స్ప్రె్సలకు కూడా ఈ తేదీల్లో కాట్పాడి-తిరుపతిల మధ్య రాకపోకలు రద్దు చేసినట్లు తెలిపారు.తిరుపతిలో రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా రైళ్లను తాత్కాలికంగారద్దు చేస్తున్నామని, ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.