Share News

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:07 AM

నవోదయ స్కూల్‌లో ఆరో తరగతి ప్రవేశానికి శనివారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో విజయేంద్రరావు, నవోదయ ప్రిన్సిపాల్‌ గోవిందరావు తెలిపారు.

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

చిత్తూరు (సెంట్రల్‌), జనవరి 20: నవోదయ స్కూల్‌లో ఆరో తరగతి ప్రవేశానికి శనివారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో విజయేంద్రరావు, నవోదయ ప్రిన్సిపాల్‌ గోవిందరావు తెలిపారు. పరీక్షల నిర్వహణకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 26 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 4789 మంది విద్యార్థులకుగాను 3919 మంది హాజరవగా, 870 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. డీఈవో ఐదు కేంద్రాలు, తాను ఐదు కేంద్రాలు పరిశీలించినట్లు ప్రిన్సిపాల్‌ వివరించారు.

Updated Date - Jan 21 , 2024 | 12:07 AM