Share News

కథలకు ఆహ్వానం

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:03 AM

కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారాలకు వర్థమాన రచయితల నుంచి కథల సంపుటిలు, నవలలు, చందోబద్ద, వచన కవితలను ఆహ్వానిస్తున్నట్లు పురస్కారాల ప్రదాతలు డాక్టర్‌ కె.రామలక్ష్మి, రోజాప్రియ, నిరంజన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కథలకు ఆహ్వానం

చిత్తూరు కల్చరల్‌, జనవరి 8: కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారాలకు వర్థమాన రచయితల నుంచి కథల సంపుటిలు, నవలలు, చందోబద్ద, వచన కవితలను ఆహ్వానిస్తున్నట్లు పురస్కారాల ప్రదాతలు డాక్టర్‌ కె.రామలక్ష్మి, రోజాప్రియ, నిరంజన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన రచయితలు, కవులు మాత్రమే తమ రచనలను ఈనెల 31వ తేదీలోపు ‘డాక్టర్‌ కె.రామలక్ష్మి, రామలక్ష్మి నర్సింగ్‌హోమ్‌, సుందరయ్యవీధి, చిత్తూరు-517001’ చిరునామాకు పంపాలని కోరారు. ఏప్రిల్‌ 17న శ్రీరామ నవమి సందర్భంగా చిత్తూరులో నిర్వహించే కార్యక్రమంలో విజేతలకు పురస్కారాలను ప్రదానం చేస్తామని పేర్కొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:03 AM