చోరీ కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష
ABN , Publish Date - Mar 12 , 2024 | 01:34 AM
దొంగతనం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
![చోరీ కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చిత్తూరులీగల్, మార్చి 11: దొంగతనం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బంగారుపాళ్యం మండలం ఊటువంక గ్రామానికి చెందిన గిరి ఇంట్లో 2023 ఫిబ్రవరిలో తమిళనాడు రాష్ట్రం మదినేపల్లెకు చెందిన మురళి బంగారు నగల దొంగతనం చేశాడు. దీనిపై బంగారుపాళ్యం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు సోమవారం ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి కోర్టులో వాయిదా ఉండింది. కేసు పూర్వాపరాలు పరిశీలించాక మురళిపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి ఉమాదేవి మూడేళ్ల జైలు శిక్ష, రూ.వంద జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.