Share News

టెన్త్‌ పరీక్షల్లో ముగ్గురి డీబార్‌

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:19 AM

చిత్తూరులోని సోషియల్‌ వెల్ఫెర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో శనివారం జరిగిన టెన్త్‌ ఫిజికల్‌ సైన్స్‌ పరీక్షల్లో ముగ్గురిని డీబార్‌ చేసినట్లు జిల్లా పరిశీలకుడు మస్తానయ్య తెలిపారు.

టెన్త్‌ పరీక్షల్లో ముగ్గురి డీబార్‌

చిత్తూరు (సెంట్రల్‌), మార్చి 23: చిత్తూరులోని సోషియల్‌ వెల్ఫెర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో శనివారం జరిగిన టెన్త్‌ ఫిజికల్‌ సైన్స్‌ పరీక్షల్లో ముగ్గురిని డీబార్‌ చేసినట్లు జిల్లా పరిశీలకుడు మస్తానయ్య తెలిపారు. ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల నిర్వహణ సరిగా లేదని.. సెంటర్ల నిర్వాహకులపై దృష్టి సారించినట్లు తెలిపారు. చిత్తూరులోని కన్నన్‌ స్కూల్‌, గిరింపేట మున్సిపల్‌ స్కూల్‌ సెంటర్లలోని చీఫ్‌ సూపరింటెండెంట్లను మార్చి వేసినట్లు తెలిపారు. కాగా, శనివారం జరిగిన పరీక్షల్లో 21,767 మంది విద్యార్థులకు గాను 21,210 మంది హాజరు కాగా, 557 మంది గైర్హాజరైనట్లు డీఈవో దేవరాజు, పరీక్షల సహాయ కమిషనర్‌ చాముండేశ్వరి తెలిపారు.

Updated Date - Mar 24 , 2024 | 12:19 AM