Share News

పోలీసు స్పందనకు 18 అర్జీలు

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:21 AM

పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనకు జిల్లా నలుమూలల నుంచి 18 మంది హాజరై వినతిపత్రాలను అందించారని ఎస్పీ జాషువా తెలిపారు.

పోలీసు స్పందనకు 18 అర్జీలు
బాధితులతో మాట్లాడుతున్న ఎస్పీ జాషువా

చిత్తూరు, ఫిబ్రవరి 12: పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనకు జిల్లా నలుమూలల నుంచి 18 మంది హాజరై వినతిపత్రాలను అందించారని ఎస్పీ జాషువా తెలిపారు. సోమవారం నిర్వహించిన స్పందనలో బాధితుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ఇందులో భూ తగాదాల కింద 9, చీటింగ్‌ 4, ఆస్తి తగాదాలు 3, భర్త వేధింపులు 2 చొప్పన అర్జీలు అందాయి. అధికారుల దృష్టికి వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. ఏఎస్పీ అరీపుల్లా, డీటీసీ డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:21 AM