Share News

AP Elections: టీడీపీలో చేరిన వాలంటీర్లు

ABN , Publish Date - Apr 19 , 2024 | 06:49 PM

అధికార వైసీపీకి ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలే కాదు.. వాలంటీర్లు సైతం గట్టి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీని వీడి.. ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. అలాగే వందలాది మంది వాలంటీర్లు సైతం ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు.

AP Elections: టీడీపీలో చేరిన వాలంటీర్లు

నెల్లూరు, ఏప్రిల్ 19: అధికార వైసీపీకి ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలే కాదు.. వాలంటీర్లు సైతం గట్టి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీని వీడి.. ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. అలాగే వందలాది మంది వాలంటీర్లు సైతం ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు.

తాజాగా నెల్లూరు జిల్లాలోని పలువురు వాలంటీర్లు.. తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి పి. నారాయణ సమక్షంలో దాదాపు 100 మంది వాలంటీర్లు టీడీపీలో చేశారు. వారికి పసుపు కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు.

తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాల పట్ల వాలంటీర్లు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ఆ క్రమంలో వారంతా పార్టీలో చేరుతున్నారన్నారు. చంద్రబాబు అధికారంలొకి వచ్చిన తర్వాత వారికి రూ.10 వేల గౌరవ వేతనం అందిస్తామని చెప్పారు.

Lok Sabha Elections: నవనీత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఈసీకి రౌత్‌పై ఫిర్యాదు


అలాగే వారి విద్యార్హతలను బట్టి స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా వారి అభ్యున్నతికి కృషి చేస్తామని నారాయణ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మరోవైపు ఇదే జిల్లాలోని కొవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి సమక్షంలో విడవలూరు మండలానికి చెందిన 40 మంది వాలంటీర్లు టీడీపీలో చేరిన విషయం విధితమే.

TG Elections: బీజేపీ నేతలు గ్రాఫిక్స్ హీరోలు.. జగ్గారెడ్డి విసుర్లు

అదీకాక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీ బలహీనంగా మారింది. గత ఎన్నికల్లో 10కి 10 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. కానీ ప్రస్తుత ఎన్నికల వేళ... ఈ జిల్లాలో వైసీపీ బకటి, రెండు స్థానాలను గెలుచుకున్నా అశ్చర్యమేననే ఓ చర్చ సైతం నెల్లూరులో కొనసాగుతుంది.

ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 19 , 2024 | 06:50 PM