Share News

AP News: టీటీడీ చైర్మన్‌ పదవికి కరుణాకర్‌రెడ్డి రాజీనామా.. ఆమోదం

ABN , Publish Date - Jun 11 , 2024 | 07:07 PM

వైసీసీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ చైర్మన్‌ పదవికి ఆయన రాజీనామా చేశారు. కరుణాకర్‌రెడ్డి రాజీనామాను దేవాదాయ శాఖ కార్యదర్శి కరికాల వల్లవన్‌ ఆమోదించారు. ఈ మేకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

AP News: టీటీడీ చైర్మన్‌ పదవికి కరుణాకర్‌రెడ్డి రాజీనామా.. ఆమోదం

తిరుపతి: వైసీసీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ చైర్మన్‌ పదవికి ఆయన రాజీనామా చేశారు. కరుణాకర్‌రెడ్డి రాజీనామాను దేవాదాయ శాఖ కార్యదర్శి కరికాల వల్లవన్‌ ఆమోదించారు. ఈ మేకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.


కాగా గతేడాది ఆగస్టు నెలలో టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమితులయ్యారు. అంతకుముందు 2006-2008 మధ్య కూడా టీటీడీ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించడంతో భూమన తన పదవికి రాజీనామా చేశారు.

Updated Date - Jun 11 , 2024 | 07:07 PM