AP High Court: ఎత్తు వివాదంలో ఎస్ఐ అభ్యర్థులకు హైకోర్టు షాక్..
ABN , Publish Date - Jan 03 , 2024 | 12:11 PM
ఎత్తు వివాదంలో ఎస్ఐ అభ్యర్థులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. నెల రోజుల పాటు ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి: ఎత్తు వివాదంలో ఎస్ఐ అభ్యర్థులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. నెల రోజుల పాటు ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత ఆసుపత్రి హెచ్ఓడీ ఇచ్చిన సర్టిఫికెట్స్ను రిజిస్ట్రార్కు సమర్పించాలని అభ్యర్థులకు స్పష్టం చేశారు. తమ ఎత్తు కొలతలను పోలీస్ శాఖ సరిగా తీయలేదని ఎస్ఐ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం అభ్యర్థుల పిటిషన్లో హైకోర్టు నిజం లేదని తేల్చింది. ఆగ్రహం వ్యక్తం చేస్తూ అభ్యర్థులకు హైకోర్టు సామాజిక సేవా శిక్ష వేసింది.