BC Hostel inspects బీసీ హాస్టల్ను తనిఖీ చేసిన జడ్పీ సీఈఓ
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:27 AM
మండల కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ను జడ్పీ సీఈఓ మైకోం నిదియాదేవి గురువారం సాయంత్రం తని ఖీ చేశారు. ఈ సందర్భంగా అక్క డి మరుగుదొడ్లను పరిశీలించారు. భోజనం రుచికరంగా ఉంటుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

గుమ్మఘట్ట, జూలై 4: మండల కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ను జడ్పీ సీఈఓ మైకోం నిదియాదేవి గురువారం సాయంత్రం తని ఖీ చేశారు. ఈ సందర్భంగా అక్క డి మరుగుదొడ్లను పరిశీలించారు. భోజనం రుచికరంగా ఉంటుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
కొన్నేళ్లుగా అద్దె భవనంలో అసౌకర్యాల నడుమ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక ప్రజలు ఆమెకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆమె స్థానికంగా మరో అదనపు గదిని పరిశీలించి విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని వార్డెన అరుణను ఆదేశించారు. కార్యక్రమంలో గుమ్మఘట్ట సర్పంచ విజయలక్ష్మి సదాశివ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..