Share News

suicide యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Jun 10 , 2024 | 12:17 AM

అమడగూరు మండలం జౌకల గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ మగ్బుల్‌ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. జౌకల గ్రామానికి చెందిన రఘునాథ రెడ్డి కుమారుడు వేణుగోపాల్‌రెడ్డి (20) ఓ అమ్మాయిని ప్రేమించాడు.

suicide యువకుడి ఆత్మహత్య

కదిరి, జూన 9: అమడగూరు మండలం జౌకల గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ మగ్బుల్‌ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. జౌకల గ్రామానికి చెందిన రఘునాథ రెడ్డి కుమారుడు వేణుగోపాల్‌రెడ్డి (20) ఓ అమ్మాయిని ప్రేమించాడు.


కాగా ఆమెకు ఇటీవల వివాహమైంది. అప్పటినుంచి ఇతను తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. గత రెండురోజుల క్రితం తల్లిదండ్రులు ఉరికెళ్లారు. ఈ క్రమంలో ఇంటిలో ఎవరు లేకపోవడంతో ఆదివారం ఇంటి దూలానికి చీరతో ఉరివేసుకుని మృతిచెందాడు. ఊరినుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, మృతదేహాన్ని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్‌ఐ చెప్పారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 10 , 2024 | 12:17 AM