Share News

వైసీపీ ఇసుక దోపిడీ: టీడీపీ

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:31 AM

బత్తలపల్లి, ఫిబ్రవరి 24: వైసీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణా ద్వారా కోట్లు సంపాదించారని, ఇప్పుడు ఆ డబ్బుతో వచ్చే ఎన్నికలలో ఎ లాగైనా గెలవాలని చూస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. మండలంలోని నల్లబోయనపల్లి ఇసుక స్టాక్‌ పాయింట్‌ వద్ద శనివారం వారు నిరసన తెలిపారు.

వైసీపీ ఇసుక దోపిడీ: టీడీపీ

బత్తలపల్లి, ఫిబ్రవరి 24: వైసీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణా ద్వారా కోట్లు సంపాదించారని, ఇప్పుడు ఆ డబ్బుతో వచ్చే ఎన్నికలలో ఎ లాగైనా గెలవాలని చూస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. మండలంలోని నల్లబోయనపల్లి ఇసుక స్టాక్‌ పాయింట్‌ వద్ద శనివారం వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందన్నారు. ఆ పార్టీ ముఖ్య నాయకులు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో రూ. కోట్లు కొల్లగొట్టారని అన్నారు. పేదలు ఇళ్లు కట్టుకునేందుకు కూడా ఇసుక దొరకని దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ దోపిడీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మండలకన్వీనర్‌ నారాయణరెడ్డి, నాయకులు చల్లా శ్రీనివాసులు, సు రేంద్రనాయుడు, మందల శ్రీనివాసులు, క్రిష్ణయ్య, గరిశనపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:31 AM