Share News

ఓటమి భయంతో వైసీపీ ప్రలోభాలు

ABN , Publish Date - Apr 04 , 2024 | 12:10 AM

ఓటమి భయంతో రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ప్రలోభాలకు తెరలేపారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు.

ఓటమి భయంతో వైసీపీ ప్రలోభాలు
ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత

అనంతపురంరూరల్‌, ఏప్రిల్‌ 3: ఓటమి భయంతో రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ప్రలోభాలకు తెరలేపారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా మండలంలోని కొడిమి, ప్రజాచైతన్య కాలనీ, దర్గాకొట్టాల, జ్యోతి బసుకాలనీ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఏ రోజూ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఎమ్మెల్యే సోదరులు, వారి వ్యాపారాలు సెటిల్మెంట్లలో మునిగిపోయారన్నారు. భూధందాలు, ఇసుక, ఎర్రమట్టి మాఫీయాతో చెలరేగిపోయారన్నారు. ప్రస్తుతం ఎన్నికల ఓటమి తప్పదన్న ఉద్దేశంతో అప్పుడే ప్రలోబాలకు తెరలేపారన్నారు. సూమారు రూ. రెండు కోట్ల విలువైన చీరలు కొనుగోలు చేశారని, వాటిని ఓటర్ల ఇళ్ల వద్దకు తీసుకొస్తారని అన్నారు. వాటిని తీసుకొని ఓటు మాత్రం సైకిల్‌ గుర్తుకే వేయాలని సూచించారు. ఏదో వంద రూపాల చీర ఇవ్వడం కాదని రూ.5వేల చీర ఇచ్చినా.. వారు చేసిన అక్రమ సంపాదనలో చాలా చిన్నదన్నారు.

Updated Date - Apr 04 , 2024 | 12:10 AM