Share News

రాష్ట్రాన్ని అప్రతిష్ట పాల్జేసిన వైసీపీ

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:58 PM

రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. వైసీపీ రాష్ట్రాన్ని అప్రతిష్ట పాల్జేసిందని విమర్శించారు.

రాష్ట్రాన్ని అప్రతిష్ట పాల్జేసిన వైసీపీ
ప్రజలకు సూపర్‌ సిక్స్‌ పథకాలు వివరిస్తున్న సునీల్‌కుమార్‌

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌

అగళి, మార్చి 27 : రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. వైసీపీ రాష్ట్రాన్ని అప్రతిష్ట పాల్జేసిందని విమర్శించారు. ఆయన బుధవారం మండలం లోని హెచడీపల్లి, బ్యాడిగిర గ్రామ పంచాయతీల్లో ఇంటింటా ప్రచార కార్య క్రమాన్ని చేపట్టారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే ఈరన్న పాల్గొన్నారు. ప్రచారంలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తొలుత దేవనహళ్లిలో అంజనేయస్వామికి పూజలు చేశారు. ఈ సందర్భంగా సునీల్‌ కుమార్‌ మాట్లా డుతూ... వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసింద న్నారు. రాష్ట్రంలో దౌర్జన్యాలు, దోపిడీలు అధికమై అభివృద్ధికి నోచు కోలేదన్నారు. పలుచోట్ల సమస్యలు తెలుసుకుని టీడీపీ అధికారంలోకి రాగానే పరిష్కరి స్తామని హామీ ఇచ్చారు. టీడీపీ గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే మన ధ్యేయమన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఆయనతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్కలిగ సాధికారత కన్వీనర్‌ పాండురంగప్ప, మాజీ ఎంపీపీ రామక్రిష్ణ , మాజీ జడ్పీటీసీలు రామక్రిష్ణ యాదవ్‌, నరసింహమూర్తి మండల కన్వీనర్‌ కుమారస్వామి, నాయకులు రవి భూషణ్‌, ఉగ్రనరసింహ, కేఎన పల్లి సురేష్‌, టీడీపల్లి మంజునాథ్‌, గోవిందప్ప, నాగోజీ, అలీఖాన, ఉమేష్‌, త్రిల్లర్‌మంజు, చిత్తనాథప్ప, క్యాతప్ప గుండప్ప, కోట్ల రంగనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 11:58 PM