యశోదమ్మ ఇంటింటి ప్రచారం
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:21 AM
కదిరి, ఫిబ్రవరి 29: రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిపించాలని ఆ పార్టీ కదిరి నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్ సతీమణి కందికుంట యశోదమ్మ గురువా రం ప్రచారం చేశారు.
![యశోదమ్మ ఇంటింటి ప్రచారం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కదిరి, ఫిబ్రవరి 29: రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిపించాలని ఆ పార్టీ కదిరి నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్ సతీమణి కందికుంట యశోదమ్మ గురువా రం ప్రచారం చేశారు. స్థానిక 22వ వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ సైకిల్గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ అఽధికారంలోకి రావాలన్నారు. వార్డులో ఆమెకు ఘనస్వాగతం లభించింది. కార్యక్రమంలో నాయకులు ఫర్వీనాభాను, కౌన్సిలర్ సావిత్రమ్మ, డైమండ్ ఇర్షాన, ఇనాయత, షౌకత, అహ్మద్అలీ, బాబ్జాన, ఇస్మాయిల్, నాసిర్, లియాకత, కాటం మనోజ్, సులేమాన, మన్సూర్, పవన, గంగరత్నమ్మ, రమణమ్మ, ఉమాదేవి, ప్రేమలత, ఫరీదా తదితరులు పాల్గొన్నారు.