Share News

జనసేన బలోపేతానికి కృషి చేయండి

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:32 AM

ధర్మవరం, ఫిబ్రవరి 11: జనసేనను గ్రామస్థాయి నుం చి బలోపేతం చేసేందుకు ప్ర తి ఒక్క నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పిలుపునిచ్చారు.

జనసేన బలోపేతానికి కృషి చేయండి

ధర్మవరం, ఫిబ్రవరి 11: జనసేనను గ్రామస్థాయి నుం చి బలోపేతం చేసేందుకు ప్ర తి ఒక్క నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని తన స్వ గృహంలో ఆదివారం ఆయన సమక్షంలో కొత్తపేటకు చెందిన 10 కుటుంబాల వారు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ చిలకం కండువాలు కప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ పార్టీలో కష్ట పడి పని చేసే వారికి ప్రత్యేక గుర్తింపు ఇస్తామన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరారు. పార్టీలోకి చేరిన వారిలో షేక్‌ మహబూబ్‌బాషా, దేవరకొండ కాశీ, బోయ నాగేశ, వసంతం నాగేశ, దాసరి కిరణ్‌తో పాటు పలువురు ఉన్నారు. కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బెస్తశ్రీనివాసులు, జనసేన మండల ఉపాధ్యక్షుడు గొట్లూరు జీవీ, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు పేరూరు శ్రీనివాసులు, బండ్ల చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 12:32 AM