craime: అనుమానంతో భార్య హత్య
ABN , Publish Date - Apr 27 , 2024 | 01:20 AM
పుట్టపర్తి రూరల్, ఏప్రిల్ 26: అనుమానం పెనుభూతంగా మారడంతో భర్తచేతిలో భార్య దారుణహత్యకు గురైంది. ఈ విషాదకర ఘటన మండలంలోని వెంగళమ్మచెరువులో శుక్రవారం చోటుచేసుకుంది. పుట్టపర్తి రూరల్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన ్నాయి.
![craime: అనుమానంతో భార్య హత్య](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పుట్టపర్తి రూరల్, ఏప్రిల్ 26: అనుమానం పెనుభూతంగా మారడంతో భర్తచేతిలో భార్య దారుణహత్యకు గురైంది. ఈ విషాదకర ఘటన మండలంలోని వెంగళమ్మచెరువులో శుక్రవారం చోటుచేసుకుంది. పుట్టపర్తి రూరల్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన ్నాయి.
వెంగళమ్మచెరువుకు చెందిన గ్రామ వలంటీరు ఈడిగ పవనకుమార్, పెడపల్లి బత్తలపల్లికి చెందిన తన మేనమామ కూతురు త్రివేణిని ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. మొదట్లో వీరి కాపురం బాగానే సాగింది. అయితే గత కొంత కాలంగా పవనకుమార్ భా ర్యపై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడుతుండేవాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి తీవ్రస్థాయిలో గొడవపడ్డాడు. ఆగ్రహానికి గురైన పవనకుమార్.. త్రివేణిని కొడవలితో విచక్షణారహితంగా నరికి హత్యచేశాడు. వారికి 3 సంవత్సరాలు, 4 నెలల వయసుగల ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ కృష్ణమూర్తి పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం...