Share News

పల్లె సింధూర విస్తృత ప్రచారం

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:31 AM

కొత్తచెరువు, ఏప్రిల్‌ 5: మండలంలోని పోతులకుంట, మరుకుంటపల్లి, మల్లెంపల్లి గ్రామాలలో శుక్రవారం టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేపట్టారు.

పల్లె సింధూర విస్తృత ప్రచారం

కొత్తచెరువు, ఏప్రిల్‌ 5: మండలంలోని పోతులకుంట, మరుకుంటపల్లి, మల్లెంపల్లి గ్రామాలలో శుక్రవారం టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికీ తిరిగి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. మినీమేనిఫెస్టో పథకాల గురించి వివరించారు. వాటి వల్ల కుటుంబంలో ఎవరెవరికి ఏయే పథకాలు వర్తిస్తాయి. ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో వెల్లడించారు. చంద్రబాబు సీఎం అయితే ఈ పథకాలన్నీ వెంటనే అ మలవుతాయని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి నియోజవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఆస్తులను కూడబెట్టుకోవడానికే ఆయనకు సమయం సరిపోయిందని విమర్శించారు. వచ్చే ఎన్నికలలో శ్రీధర్‌రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ప్రభుత్వం పింఛన్లను ఆలస్యంగా పంపిణీచేయడం వెనుక రా జకీయ కుట్ర దాగి ఉందని, నిధులు విడుదల చేయకుండా వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై నింద వేస్తోందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. వీటిని ప్రజలు గమనించి వచ్చే ఎన్నికలలో వైసీపీకి గుణపాఠం చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో పల్లెవెంకట

కృష్ణకిశోర్‌రెడ్డి, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 12:31 AM