ఎప్పుడు కూలుతుందో.. ఏమో..!
ABN , Publish Date - May 03 , 2024 | 11:52 PM
తాము అధికారంలోకి వస్తే డిజిటల్ లైబ్రరీ నిర్మిస్తామన్నారు. కానీ ఉన్నవాటికి కనీసం మరమ్మతులు చేయించలేని దుస్థితిలో వైసీపీ పాలకులు ఉండిపోయారు. మండల కేంద్రంలోని గ్రంథాలయం ఎప్పుడు కూలుతుందోనన్న స్థితిలో ఉంది. దీంతో నిత్యం గ్రంఽథాలయానికి వచ్చే పాఠకులు భయాందోళన చెందుతున్నారు.
![ఎప్పుడు కూలుతుందో.. ఏమో..!](https://media.andhrajyothy.com/media/2024/20240428/2rdg8_bd538fefc0.jpg)
బొమ్మనహాళ్, మే 3: తాము అధికారంలోకి వస్తే డిజిటల్ లైబ్రరీ నిర్మిస్తామన్నారు. కానీ ఉన్నవాటికి కనీసం మరమ్మతులు చేయించలేని దుస్థితిలో వైసీపీ పాలకులు ఉండిపోయారు. మండల కేంద్రంలోని గ్రంథాలయం ఎప్పుడు కూలుతుందోనన్న స్థితిలో ఉంది. దీంతో నిత్యం గ్రంఽథాలయానికి వచ్చే పాఠకులు భయాందోళన చెందుతున్నారు. కొంతమంది రావడం మానేశారు. అధికారులు పలుమార్లు శిథిల భవనాన్ని చూసి వెళుతున్నారే తప్ప కనీసం భవనానికి మరమ్మతులు చేయించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గదులతో పాటు వరండా పూర్తిగా దెబ్బతింది. స్లాబు దెబ్బతిని ఇనుప కమ్మీలు బయటపడి పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఇక వర్షం వస్తే గదుల్లో ఉన్న పుస్తకాలు, పత్రికలు తడిసి ముద్ధవుతాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీకో డిజిటల్ లైబ్రరీ(గ్రంథాలయం) నిర్మాణం చేస్తామని హామీలు ఇచ్చారు. అవి ఇప్పటికీ నిర్మాణాలకు నోచుకోలేదు.