Share News

AMILINENI: అఖండ మెజార్టీతో విజయం సాధిస్తాం

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:47 PM

కళ్యాణదుర్గంలో అఖండ మెజార్టీతో విజయం సాధిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. వైసీపీ నామినేషన రోజునే కళ్యాణదుర్గంలో ఆ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. టీడీపీలోకి బుధవారం భారీగా చేరారు. వారందరికీ అమిలినేని టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

AMILINENI: అఖండ మెజార్టీతో విజయం సాధిస్తాం
టీడీపీలోకి చేరిన వారితో అమిలినేని సురేంద్రబాబు

అమిలినేని సురేంద్రబాబు

టీడీపీలోకి భారీగా చేరికలు

కళ్యాణదుర్గం, ఏప్రిల్‌ 24: కళ్యాణదుర్గంలో అఖండ మెజార్టీతో విజయం సాధిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. వైసీపీ నామినేషన రోజునే కళ్యాణదుర్గంలో ఆ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. టీడీపీలోకి బుధవారం భారీగా చేరారు. వారందరికీ అమిలినేని టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కళ్యాణదుర్గం మండలం బాల వెంకటాపురం గ్రామానికి చెందిన మూడు వైసీపీ కుటుంబాలు, కాపర్ల పల్లి గ్రామానికి చెందిన ఆరు వైసీపీ కుటుంబాలు, కుందుర్పి మండలం బెస్తరపల్లికు చెందిన 40 వైసీపీ కుటుంబాలు, బొమ్మాజీ పల్లికు చెందిన 15 వైసీపీ కుటుంబాలు, యర్రగుంట గ్రామం నుంచి టీడీపీ పార్టీలోకి భారీగా చేరారు. వీరందరికీ పార్టీ కండువా వేసి అమిలినేని టీడీపీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గంలో టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రోజురోజుకు చేరికలు ఎక్కువై పోతుండటంతో పార్టీలో కొత్త జోష్‌ నిండిందన్నారు. ఆ ఉత్సాహంతోనే ఈ ఎన్నికల్లో 50 వేల వరకు మెజార్టీ రావడం ఖాయమన్నారు. ప్రతి గ్రామంలో టీడీపీ బలం పుంజుకుంటోందన్నారు.


ఈ ప్రజాబలంతోనే విజయాన్ని సాధిస్తామన్నారు. వైసీపీపై ప్రజలందరూ విసుగుచెందే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రతి గ్రామంలోనూ చంద్రబాబు పాలనను కోరుకుంటున్నారన్నారు. సూపర్‌సిక్స్‌ పథకాలు ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్నారు. భావితరాల భవిష్యత్తు, కుటుంబానికి ఆర్థిక భద్రత వుండాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందన్నారు. ఆ దిశగా మనమందరం ఐక్యతతో టీడీపీని గెలిపించాలని కోరారు. మనందరి ధ్యేయం టీడీపీ గెలవాలి, చంద్రబాబు సీఎం కావాలని ముందుకు సాగాలన్నారు. అప్పుడే మన బలం ప్రజలకు తెలుస్తుందన్నారు. గ్రామ గ్రామాన టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. పార్టీకి వస్తున్న అపూర్వ ఆదరణతోనే కళ్యాణదుర్గంలో తిరుగులేని విజయం సాధిస్తామన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

నేటి నామినేషనకు తరలిరండి: కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం నిర్వహించే నామినేషన కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు నాయకులు భారీగా తరలిరావాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు. బుధవారం ప్రజావేదిక వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. నామినేషన కార్యక్రమంలో టీడీపీ ప్రజాబలాన్ని నిరూపించాలన్నారు. టీడీపీకు కంచుకోటగా మారిన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అశేషంగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కళ్యాణదుర్గంలో టీడీపీని గెలిపించడమే మొదటి కర్తవ్యంగా ముందుకు సాగాలన్నారు. అప్పుడే మన విజయం సునాయాసంగా మారుతుందన్నారు.


చంద్రబాబును సీఎంగా చేసుకుందాం

- అమిలినేని యశ్వంత

చంద్రబాబునాయుడును సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అమిలినేనిసురేంద్రబాబు తనయుడు అమిలినేని యశ్వంత పిలుపునిచ్చారు. బుధవారం ప్రజావేదిక వద్ద కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలురావాలంటే చంద్రబాబునాయుడే సీఎం కావాలన్నారు. భావితరాల భవిష్యత్తు బాగుపడాలన్నా చంద్రబాబునాయుడుతోనే సాధ్యమవుతుందన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్క నిరుద్యోగ యువత చంద్రబాబు పాలనపై మొగ్గు చూపుతూ సీఎంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. కార్యక్రమంలో పీనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 24 , 2024 | 11:47 PM