ఎన్నికల ప్రచారంలో వలంటీర్
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:32 AM
మండల పరిధిలోని బూదిలి పంచాయతీలోని గంగాదేవిపల్లిలో గురువారం నిర్వహించి వైసీపీ ఎన్నిక ప్రచారంలో గ్రామ వలంటీర్ బోయ రమేష్ పాల్గొన్నారు.
గోరంట్ల, మార్చి 28: మండల పరిధిలోని బూదిలి పంచాయతీలోని గంగాదేవిపల్లిలో గురువారం నిర్వహించి వైసీపీ ఎన్నిక ప్రచారంలో గ్రామ వలంటీర్ బోయ రమేష్ పాల్గొన్నారు. మాజీ సర్పంచ బూదిలి శ్రీనివాసరెడ్డి , సర్పంచ రామాంజనేయులు ఆధ్వర్యంలో గంగాదేవి పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు ఇంటింటికెళ్లి ప్రచారం నిర్వహిస్తుండగా ఆ కార్యక్రమంలో సర్పంచతో పాటు వలంటీర్ బోయ రమేష్ పాల్గొన్నారు. ఈవిషయంపై గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.