Share News

అభిమానులతో వెంకటాపురం కిటకిట

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:08 AM

పరిటాల సునీత నాల్గవ సారి ఎమ్మెల్యేగా విజయం సా ధించి బుధవారం స్వగ్రామం వెంకటాపు రానికి చేరుకోవడంతో ఆమెకు శుభా కాంక్షలు తెలిపేందుకు జనం పోటెత్తారు.

అభిమానులతో వెంకటాపురం కిటకిట
వెంకటాపురంలో మాట్లాడుతున్న పరిటాల సునీత

రామగిరి, జూన 5: పరిటాల సునీత నాల్గవ సారి ఎమ్మెల్యేగా విజయం సా ధించి బుధవారం స్వగ్రామం వెంకటాపు రానికి చేరుకోవడంతో ఆమెకు శుభా కాంక్షలు తెలిపేందుకు జనం పోటెత్తారు. వెంకటాపురంగ్రామం టీడీపీ నాయకులు, కార్యకర్తలు,స్నేహితులు, సన్నిహితులు భారీగా తరలిరావడంతో వెంకటాపురం కిటకిటలాడింది. బీజేపీ, ీసీపీఐ నాయకుల తో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా, ధర్మవరం, పెనుకొండతో పాటు రాప్తాడు నియోజకవర్గవ్యాప్తంగా అన్ని మండలాల నుంచి వేలాది మంది వెంకటాపురానికి తరలివచ్చారు. ఎనఎస్‌గేటు నుంచి వెంకటాపురం వరకు వాహనాల రాకపోకలతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అభిమానుల తాకిడి తగ్గలేదు. పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ను సత్కరించారు. వచ్చిన ప్రతి ఒక్కరిని వారు ఆప్యాయంగా పలకరించారు. ఇలవేల్పు యల్లమ్మ ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, ఆ తరువాత అంత కలిసిమెలసి ఉండాలని ఈ సందర్భంగా వారు సూచించారు.


మలేషియాలో టీడీపీ నేతల సంబరాలు

అనంతపురంరూరల్‌ : సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, రాప్తాడు నియో జకవర్గంలో కూటమి అభ్యర్థి పరి టాల సునీత గెలుపుతో మండ లంలోని టీడీపీ నాయకులు మలేషి యాలో సంబరాలు జరుపుకు న్నారు. కక్కలపల్లి కాలనీ పంచా యతీ నందమూరినగర్‌ యూనిట్‌ ఇనచార్జ్‌ రంగనాయకులు ఇతర నాయకులు పార్టీ జెండా ఆవిష్క రించి, కేక్‌కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే సునీతను వెంకటాపురంలో మండల టీడీపీ నాయకులు దండోర రమణ కలిసి.. శుభాకాంక్షలు తెలి పారు. పరిటాల శ్రీరామ్‌ను సత్కరించారు.

Updated Date - Jun 06 , 2024 | 12:08 AM