ఘనంగా వీరాంజనేయస్వామి రథోత్సవం
ABN , Publish Date - Mar 18 , 2024 | 12:05 AM
కుందుర్పి మండల పరిధిలోని వడ్డీపాలెం గ్రామంలో వెలసిన గుడిబండ వీరాంజనేయస్వామి రథోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.
![ఘనంగా వీరాంజనేయస్వామి రథోత్సవం](https://media.andhrajyothy.com/media/2024/20240313/17_KLD_11_6d7b3ebb4e.jpg)
కుందుర్పి, మార్చి 17: కుందుర్పి మండల పరిధిలోని వడ్డీపాలెం గ్రామంలో వెలసిన గుడిబండ వీరాంజనేయస్వామి రథోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గుడిబండ వీరాంజనేయస్వామి రథోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గుడిబండ వీరాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 10 గంటలకు రథోత్సవం ముందు పూజలు, హోమాలు నిర్వహించారరు. భక్తులు పెద్దఎత్తున రథోత్సవానికి పూలహారాలు సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం వేలాదిమంది భక్తుల మధ్య రథోత్సవాన్ని ముందుకు లాగారు. రథోత్సవాన్ని గెలిపించడానికి కర్ణాటక, ఆంధ్ర దగ్గర ప్రాంతాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరై స్వామి వారరికే మొక్కులు తీర్చుకొన్నారు. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. భక్తులకు పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.