Share News

హజ్‌ యాత్రికులకు వ్యాక్సినేషన

ABN , Publish Date - May 03 , 2024 | 12:49 AM

హజ్‌ యాత్రకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 216 మంది యాత్రికుల కోసం గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్‌ కళాశాల ఆడిటోరియంలో వ్యాక్సినేషన కార్యక్రమం చేపట్టారు.

హజ్‌ యాత్రికులకు వ్యాక్సినేషన
వ్యాక్సినేషన శిబిరాన్ని పరిశీలిస్తున్న డీఎంహెచఓ

అనంతపురం కల్చరల్‌, మే 2 : హజ్‌ యాత్రకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 216 మంది యాత్రికుల కోసం గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్‌ కళాశాల ఆడిటోరియంలో వ్యాక్సినేషన కార్యక్రమం చేపట్టారు. 208 మంది యాత్రికులకు వ్యాక్సినేషన చేయించుకున్నారు. డీఎంహెచఓ డాక్టర్‌ భ్రమరాంబదేవి, డీఐఓ డాక్టర్‌ యుగంధర్‌ ఆ కార్యక్రమాన్ని పరిశీలించారు. హజ్‌ యాత్రికులకు తగు జాగ్రత్తలు, ఆరోగ్య సూత్రాలను వివరించారు.


గురువారం వ్యాక్సినేషనకు గైర్హాజరైనవారు శుక్రవారం తప్పకుండా వ్యాక్సినేషన చేయించుకోవాలని సూచించారు. ఈనెల 25 లోపు యాత్ర చర్యలు చేపట్టనున్నట్లు హజ్‌ కమిటీ జిల్లా కన్వీనర్‌ మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ వెళ్లడించారు. కార్యక్రమంలో హజ్‌ కమిటీ ప్రతినిధి షేక్‌ నూరుద్దీన, ఎంఏ మునీర్‌భాష, జాఫర్‌ మొహిద్దీన పాల్గొన్నారు.


మరిన్ని వార్తల కోసం...

Updated Date - May 03 , 2024 | 12:49 AM