ఆస్పత్రిలో ఖాళీ వైద్య పోస్టులను భర్తీ చేయాలి
ABN , Publish Date - Jan 03 , 2024 | 12:06 AM
పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేయాలని సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్కు బీజేపీ నాయకులు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు.
![ఆస్పత్రిలో ఖాళీ వైద్య పోస్టులను భర్తీ చేయాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
గుంతకల్లు టౌన, జనవరి 2: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేయాలని సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్కు బీజేపీ నాయకులు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతి చిన్న విషయానికి రోగులను అనంతపురం, కర్నూలుకు రెఫర్ చేస్తున్నారన్నారు. విధులకు వేళకు రాని వైద్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. డ్యూటీ డాక్టర్ల పేర్లను నోటీసు బోర్డులో రాయాలన్నారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్, ప్రధాన కార్యదర్శి జేసీ వెంకటేశ్వర్లు, బండారు క్రిష్ణమూర్తి, విజయలక్ష్మి, రాఘవ, శ్రీనివాసులు, కే శివ, సిరాజుద్దీన, పద్మ, చిన్నకళావతి, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.