Share News

road accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల మృతి

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:08 AM

బుక్కపట్నం, ఏప్రిల్‌ 25: మండలంలోని లింగప్పగారిపల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు మృతిచెందారు. లింగప్పగారిపల్లి గ్రామానికి చెందిన నరసానాయుడు(42), ప్రభాకర్‌(33) సిద్దరాంపురం నుంచి స్వగ్రామమైన లింగప్పగారిపల్లికి ద్విచక్రవాహనంలో వెళ్తున్నారు.

road accident: రోడ్డు ప్రమాదంలో  ఇద్దరు టీడీపీ కార్యకర్తల మృతి

-విషాదంలో లింగప్పగారిపల్లి

బుక్కపట్నం, ఏప్రిల్‌ 25: మండలంలోని లింగప్పగారిపల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు మృతిచెందారు. లింగప్పగారిపల్లి గ్రామానికి చెందిన నరసానాయుడు(42), ప్రభాకర్‌(33) సిద్దరాంపురం నుంచి స్వగ్రామమైన లింగప్పగారిపల్లికి ద్విచక్రవాహనంలో వెళ్తున్నారు.


గ్రామ సమీపంలోకి రాగానే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతిచెందారు. నరసానాయుడుకు భా ర్య కళావతి, ముగ్గురు కు మార్తెలు ఉ న్నారు. ప్రభాకర్‌కు భార్య పౌర్ణమి , ఇద్దరుకుమారులు ఉన్నారు. ఈ సంఘటనతో లింగప్పగారిపల్లిలో విషాధచాయలు అలుముకున్నాయి. మృతులను పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Apr 26 , 2024 | 12:08 AM