దాడి కేసులో ఇద్దరికి ఏడాది జైలు
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:34 AM
కదిరిలీగల్, ఫిబ్రవరి 12 : తనకల్లు మండలం బిసనివారిపల్లిలో వి. సూర్యనారాయణ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరచిన కేసులో ఇద్దరికి కదిరి కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 3000 జరిమానా విధించి తీర్పు చెప్పింది
![దాడి కేసులో ఇద్దరికి ఏడాది జైలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కదిరిలీగల్, ఫిబ్రవరి 12 : తనకల్లు మండలం బిసనివారిపల్లిలో వి. సూర్యనారాయణ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరచిన కేసులో ఇద్దరికి కదిరి కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 3000 జరిమానా విధించి తీర్పు చెప్పింది. బిసనివారిపల్లికి చెందిన శేషగిరి, వెంకటనారాయణలు సూర్యనారాయణతో ఘర్షణ పడ్డారు. ఈక్రమంలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తనకల్లు ్లపోలీసులు ఈ సంఘటనపై 2017 సంవత్సరంలో క్రైమ్ నెంబర్ 20-17 గా కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసుపై కోర్టు వాదోవాదాలు విన్న తరువాత సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి ఎస్ ప్రతిమ నిందితులకు శిక్ష ఖరారు చేశారు. ప్రాసిక్యూషన తరఫున ఏపీపీ లక్ష్మీసాయి, రామకృష్ణ వాదించారు.