టీడీపీలోకి వలసలతో ‘తోపు’ వణుకు
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:32 AM
నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున వలసల పరంపర కొనసాగుతుండటం.. తోపు బ్రదర్స్ వెన్నులో వణుకు పుట్టిస్తోందని కూటమి రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత పేర్కొన్నారు.
![టీడీపీలోకి వలసలతో ‘తోపు’ వణుకు](https://media.andhrajyothy.com/media/2024/20240413/_1de045fda2.jpg)
చెన్నేకొత్తపల్లి, ఏప్రిల్ 27: నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున వలసల పరంపర కొనసాగుతుండటం.. తోపు బ్రదర్స్ వెన్నులో వణుకు పుట్టిస్తోందని కూటమి రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని ఉప్పరవాండ్లకొట్టాల, బసినేపల్లి, నాగసముద్రం గ్రామాల్లో ఆమె పర్యటించారు. టీడీపీలోకి చాలా మంది చేరుతుంటే దానిని జీర్ణించుకోలేక ఎమ్మెల్యే ప్రకాశరెడ్డి, ఆయన సోదరులు దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎక్కడా అబివృద్ధి కనిపించలేదని, ఈ ఎమ్మెల్యే ఒక్కసారి కూడా గ్రామాలవైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్నారు. ప్రచారంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఎల్ నారాయణచౌదరి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కుంటిమద్ది రంగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబులేశు, నాయకులు పాల్గొన్నారు.
ఆగని టీడీపీలోకి వలసలు..
అనంతపురంరూరల్ : రాప్తాడు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో అనంతపురంలో క్యాంప్ కార్యాలయంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కనగానపల్లి మండలం కోనాపురం, చెన్నేకొత్తపల్లి, కనుముక్కల గ్రామం, ముష్టికోవెల, ఆత్మకూరు, రాప్తాడు, కనగానపల్లి, అనంతపురం రూరల్ ఆకుతోటపల్లి తదితరులు గ్రామాలకు చెందిన వారు టీడీపీలో చేరారు.
మరిన్ని వార్తల కోసం...