Share News

ఉమ్మడిగా.. సంక్రాంతి సందడి

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:39 AM

సాధారణంగా ఆరేడుగురు కుటుంబ సభ్యు లు ఒకచోట చేరితేనే సందడిగా పండుగ వాతావరణం నెలకొంటుంది. అటువంటిది మూడు వంశాల వారు, ఒకరితో ఒకరికి బంధుత్వం కలవారు 60మందికి పైగా ఒకేచోట చేరి మూడు రోజులపాటు పండు గ వేడుకలు నిర్వహిస్తే నిజంగా సంక్రాంతే.

ఉమ్మడిగా.. సంక్రాంతి సందడి

పండుగ సందర్భంగా ఒకేచోట చేరిన 60మంది బంధువులు

యాడికి, జనవరి16: సాధారణంగా ఆరేడుగురు కుటుంబ సభ్యు లు ఒకచోట చేరితేనే సందడిగా పండుగ వాతావరణం నెలకొంటుంది. అటువంటిది మూడు వంశాల వారు, ఒకరితో ఒకరికి బంధుత్వం కలవారు 60మందికి పైగా ఒకేచోట చేరి మూడు రోజులపాటు పండు గ వేడుకలు నిర్వహిస్తే నిజంగా సంక్రాంతే. మండలంలోని రాయల చెరువు గ్రామానికి చెందిన మాదాల, మోటుపల్లె, యలమ వంశాలకు చెందిన 60 మంది బంధువులు ఒక్కచోట చేరి సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. వీరు గత 14సంవత్సరాలుగా ఇలా వేడుకలు నిర్వహిస్తుండటం గమనార్హం. కుటుంబ పెద్దలు, వారి కొడుకులు, కుమార్తెలు, మనవళ్లు, ముని మనవళ్లు ఇలా అందరం ఒక్కచోట చేరడం గమనార్హం. జయరాములు, సీతారాములు, రంజితకుమార్‌, వెంకటప్పనాయుడు, శారద, రాధ, సులోచన, మాదాల అనిల్‌, పవన, మను, రవి తదితర కుటుంబ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. వీరిలో రైతులు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఉన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:39 AM