Share News

చిత్రకారుడు శ్రీధరనకు ఎంఎఫ్‌ హుసేన అవార్డు

ABN , Publish Date - May 29 , 2024 | 12:03 AM

మహారాష్ట్ర ప్రభుత్వం ఆనలైనలో నిర్వహించిన ఇండియన ఆర్ట్స్‌ కాంటె్‌స్టలో చిత్రలేఖనం విభాగంలో ఎంఎఫ్‌ హుసేన అవార్డు తనకు వచ్చినట్లు పట్టణానికి చెందిన చిత్రకారుడు శ్రీధరన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

చిత్రకారుడు శ్రీధరనకు   ఎంఎఫ్‌ హుసేన అవార్డు

గుంతకల్లుటౌన, మే 28: మహారాష్ట్ర ప్రభుత్వం ఆనలైనలో నిర్వహించిన ఇండియన ఆర్ట్స్‌ కాంటె్‌స్టలో చిత్రలేఖనం విభాగంలో ఎంఎఫ్‌ హుసేన అవార్డు తనకు వచ్చినట్లు పట్టణానికి చెందిన చిత్రకారుడు శ్రీధరన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15న మహారాష్ట్ర ప్రభుత్వం ఆనలైనలో ఇండియన ఆర్ట్స్‌ కాంటెస్ట్‌ నిర్వహించిందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వంద మంది చిత్రకారు లు ఈ పోటీలో పాల్గొన్నట్లు వివరించారు. తాను అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణుడు చిత్రాన్ని గీసినట్లు తెలిపారు. ఇందుకు గాను తనకు 29వ ర్యాంకు రావడంతో ఎంఎఫ్‌ హుసేన అవార్డు దక్కినట్లు వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆనలైన ద్వారా సర్టిఫికెట్‌ను పంపిందని చిత్రకారుడు శ్రీధరన తెలిపారు. త్వరలో అవార్డు, నగదును పంపిస్తారని ఆయన తెలిపారు.

Updated Date - May 29 , 2024 | 12:04 AM