Share News

ఘనంగా తిక్కయ్యస్వామి ఉట్ల పరుష

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:09 PM

నార్పలలో ఘనంగా తిక్కయ్యస్వామి ఉట్ల పరుష కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. స్వామికి ఆకుపూజ, కుంకుమార్చన నిర్వహించారు.

ఘనంగా తిక్కయ్యస్వామి ఉట్ల పరుష
ఉట్లపరుషలో పాల్గొన్న గ్రామస్థులు

నార్పల, ఏప్రిల్‌ 13: నార్పలలో ఘనంగా తిక్కయ్యస్వామి ఉట్ల పరుష కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. స్వామికి ఆకుపూజ, కుంకుమార్చన నిర్వహించారు. యువకులు ఉట్లమాను ఎక్కడానికి ఒకరిపై ఒకరు పోటీ పడ్డారు. చివరకు నార్పలకు చెందిన భరత ఉట్లమాను ఎక్కి రూ.5,116ను బహుమతిగా పొందాడు. అలాగే టెంకాయ పగలకొట్టే పోటీలో నార్పలకు చెందిన వంశీ విజేతగా నిలిచి.. రూ.3,116 బహుమతిగా పొందాడు. సాయంత్రం తిక్కయ్యస్వామి ఉత్సవ మూర్తిని పురవీధుల్లో ఊరేగించారు. అలాగే తిక్కయ్యస్వామి జన్మించి వందేళ్లు కావడంతో చెక్కభజనలు, పౌరాణిక నాటకాలు, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 11:09 PM