వైసీపీకి ఇవే చివరి రోజులు..!
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:02 AM
రాష్ట్రంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చివరి రోజులు నడుస్తున్నాయని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు.
అనంతపురంరూరల్, మార్చి 27: రాష్ట్రంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చివరి రోజులు నడుస్తున్నాయని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. బుధవారం అరవిందనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో రాప్తాడు నియోజవకర్గం పరిధిలోని అనంతపురం రూరల్ మండలం కొడిమి, సిండికేట్ నగర్, రామగిరి మండల కుంటిమద్ది, చెన్నెకొత్తపల్లి మండలం నాగసముద్రం ప్రాంతాల నుంచి 30 కుటుంబాలు వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరారు. వారికి మాజీ మంత్రి పరిటాల సునీత కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి సోదరుల వల్ల ఆ పార్టీ నాయకులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే గతంలో ఎప్పుడూ లేనివిధంగా చేరికలు కొనసాగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో ఆపార్టీ ఖాళీ అవుతుందని అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జింకాసూర్యనారాయణ, ఎంపిటీసీ క్రిష్ణరెడ్డి, మంజునాథ్, నాగరాజు, అల్లీపీరా, రాజేష్, బుల్లేట్ రఫీ, ఆంజనేయులు, లింగారెడ్డి, నారాయణప్ప, ఎల్లప్ప, నారాయణ స్వామి,సూరి, డొక్కా నాగార్జున, ఉజ్జినప్ప, వన్నూరుస్వామి, నాగేంద్ర, రామకృష్ణ, విజయ్ పాల్గొన్నారు.